రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 13 వరకు విజయ దశమి సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. తిరిగి స్కూళ్లు వచ్చే నెల 14న ప్రారంభం అవుతాయని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 9 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.