ఓ వ్యక్తి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు హత్యకు గురయ్యాడు. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం...రంగారెడ్డి జిల్లా యచారానికి చెందిన గుర్రం కృష్ణరెడ్డి కొడుకు గుర్రం శివారెడ్డి(35) నగరంలోని కొత్తపేటలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ అక్కడే నివాసముంటున్నాడు. కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్రావునగర్ డివిజన్ మహేష్నగర్లో కృష్ణవేణి (30) అనే మహిళ గత రెండు సంవత్సరాల క్రితం తన భర్త చనిపోవడంతో తన తల్లితోపాటు ఐదు సంవత్సరాల కొడుకుతో కలసి గాయత్రి అపార్ట్మెంట్లో నివాసముంటుంది. ఈ నేపథ్యంలోనే గుర్రం శివారెడ్డితో పరిచయం ఏర్పడి కొంత కాలంగా కృష్ణవేణి సహజీవనం సాగిస్తుంది. దీంతో తరుచుగా మహేష్నగర్లో కృష్ణవేణి ఇంటికి వచ్చి వెళుతుండేవాడు.సోమవారం సాయంత్రం శివారెడ్డి కృష్ణవేణి ఇంటికి రాగా యుసుప్గూడలో నివాసముండే కృష్ణవేణి సోదరుడు శ్రీనివాస్ తన భార్యతో కలసి కృష్ణవేణి ఇంటికి వచ్చాడు. యోగక్షేమాలు మాట్లాడుకుని శివారెడ్డి, శ్రీనివాస్లు ఇంట్లోనే మద్యం సేవించారు. మద్యంమత్తులో శివారెడ్డి శ్రీనివాస్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చేసుకొని శివారెడ్డిని శ్రీనివాస్ కర్రతో కొట్టాడు. దీంతో శివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్, కృష్ణవేణి కుటుంబ సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంచగా స్ధానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థ్ధలానికి చేరుకున్న కుషాయిగూడ ఎసిపి శివకుమార్, సిఐలు చంద్రశేఖర్, భాస్కర్లు విచారణ చేపట్టారు.శ్రీనివాస్, కృష్ణవేణిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.