ఆంధ్రప్రదేశ్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఆ చానళ్లపై నిషేధం తొలగించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం చానళ్లపై నిషేధం విధించిందని ఆయన అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞత అవసరమని జీవన్రెడ్డి అన్నారు.