భారత్‌లో అడుగుపెట్టిన బాస్కెట్‌బాల్

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 09:12 AM

భారత్‌లో అడుగుపెట్టిన బాస్కెట్‌బాల్

భారత్‌లో జరుగుతున్న నేషనల్ బాస్కెట్‌బాల్ అసోషియేషన్ (ఎన్‌బీఏ) లీగ్ ముంగిట రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ముంబయి వేదికగా ఇండియా పేసర్స్, శాక్రమెంటో కింగ్స్ మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ ముగిసింది. ఎన్‌బీఏతో ఆరేళ్ల అనుబంధానికి నిదర్శనంగా రిలయన్స్ ఫౌండేషన్.. 10-16 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులకి స్టేడియంలో ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. భారత్‌లో ఎన్‌బీఏ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఇండియా పేసర్స్, శాక్రమెంటో కింగ్స్ మధ్య జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ అనూహ్యంగా 118-118తో తొలుత డ్రా అయ్యింది. దీంతో.. మరో ఐదు నిమిషాలు ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించగా.. ఇండియా పేసర్స్ 132-131 తేడాతో శాక్రమెంటో టీమ్‌పై విజయం సాధించింది. భారత్‌లో జరుగుతున్న ఈ తొలి బాస్కెట్‌బాల్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకి మ్యాచ్ బాల్‌ని ఎన్‌బీఏ కమీషనర్ ఆమ్ సిల్వర్, ఇండియా పేసర్స్, శాక్రమెంటో కింగ్స్ కెప్టెన్లు సంయుక్తంగా అందజేశారు.ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ ‘రిలయన్స్ ఫౌండేషన్ ఫస్ట్ బాస్కెట్‌బాల్‌ని ప్రజెంట్ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో అన్ని క్రీడలకి ఆదరణ పెంచాలనేది మా లక్ష్యం. ఈ మ్యాచ్ ద్వారా.. యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపాలని ఆశిస్తున్నాం. మా ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల్ని చదువులు, క్రీడల్లో ప్రోత్సహిస్తాం’ అని వెల్లడించారు.





Untitled Document
Advertisements