మహిళా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పేరుతో సోషల్ మీడియాలో సివిల్స్ ర్యాంకర్ బూతుబాగోతాలు...!

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 12:04 PM

మహిళా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పేరుతో సోషల్ మీడియాలో సివిల్స్ ర్యాంకర్ బూతుబాగోతాలు...!

సివిల్స్‌కు ప్రయత్నిస్తూ మొదటి సారి విఫలమయ్యాడు. రెండో సారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా మళ్ళీ అదే నిరాశతో వెనుదిరిగాడు. దీంతో మహిళా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తన పైశాచికత్వాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు. వారి పేర్లతో నకిలీ అకౌంట్స్ క్రియేట్‌చేసి మార్ఫింగ్ చేసిన ఫోటోలను షేర్ చేసేవాడు. వీటి కింద అసభ్యకరమైన రాతలు, సెక్స్ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందేవాడు. ఇటీవల సర్వీసులో చేరిన యువ మహిళా ఐపీఎస్ అధికారి టార్గెట్ చేస్తూ పోస్టింగ్‌లు పెట్టడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మదన్‌మోహన్ నిర్వాకంగా గుర్తించారు. ఇప్పటివరకు చాలా మంది అమ్మాయిల ఫోటోలు ఇలాగే మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో రాతలు రాసినట్టు విచారణలో తేలింది. ‘మీరు సాయంత్రాలు ఖాళీగా ఉంటున్నారా? అందమైన సాయంత్రాన్ని మరింత అందంగా గడుపుదామా? ప్రేమ అంటే మనసుకు నచ్చిన వారికి పంచడమే.. సరసమైనా.. విరసమైనా సరే.. సమఉజ్జీలుండాలి. మరి మీరు సిద్ధమేనా?’ అంటూ ఫేక్ అకౌంట్స్ నుంచి మహిళ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేరుతో పోస్టులు పెట్టేవాడు. ఇతగాడి బాధితుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌‌లలోని 54 మంది మహిళా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల ఉండటం విశేషం. హైదరాబాద్‌‌లోని ఓ ఐపీఎస్‌ అధికారిణి తన పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాను గుర్తించి, ఆ సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు తొలగించారు. అయితే, మదన్‌మోహన్ మళ్లీ సృష్టించడం.. ఆమె తొలగించడం ఇలా నాలుగుసార్లు జరిగింది. మళ్లీ ఆమె పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్య పోస్టులు చేస్తుండడంతో ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాడి భాగోతం బయటపడింది. నిందితుడు క్రియేట్‌చేసిన ఖాతాలన్నింటినీ తొలగించిన అధికారులు, మహిళా అధికారిణిల పేర్లతో ఎవరైనా అకౌంట్స్ ప్రారంభిస్తే వాటిని ఆమోదించవద్దని, తమ దృష్టికి తీసుకురావాలని ఫేస్‌బుక్‌ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. కృష్ణా జిల్లా పెదఓగిరాలకు చెందిన మదన్ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. ఇంటర్‌లో రాష్ట్రస్థాయి ర్యాంక్‌ సాధించిన అతడు.. విజయవాడలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఐదేళ్ల కిందట శిక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చాడు. రెండో ప్రయత్నంలో గతేడాది మెయిన్స్‌లో అర్హత సాధించినా, ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు. దీంతో తీవ్ర నిస్పృహ చెంది మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పేర్లతో ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి.. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.





Untitled Document
Advertisements