ఇలా ఆడితే మ్యాచ్‌ల్ని ఎవరు చూస్తారు?...ప్రశ్నించిన జర్నలిస్ట్ పై నిషేధం!

     Written by : smtv Desk | Tue, Oct 15, 2019, 08:28 PM

ఇలా ఆడితే మ్యాచ్‌ల్ని ఎవరు చూస్తారు?...ప్రశ్నించిన జర్నలిస్ట్ పై నిషేధం!

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌‌ని ప్రశ్నించిన జర్నలిస్ట్‌నిషేధానికి గురయ్యాడు. తాజాగా శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో సర్ఫరాజ్ అహ్మద్ పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరచగా.. పాక్ జట్టు 0-3తో సిరీస్‌ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. సర్ఫరాజ్‌పై మండిపడుతున్న ఉన్న ఆ దేశ క్రికెట్ అభిమానులు.. స్టేడియం వెలుపల ఏర్పాటు చేసిన అతని చిన్న కటౌట్‌ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మీడియా సమావేశంలో సర్ఫరాజ్ మాట్లాడుతుండగా.. అతడ్ని ఘాటుగా ప్రశ్నించిన జర్నలిస్ట్ నిషేధానికి గురయ్యాడు.అసలు ఏం జరిగిందంటే..? పాకిస్థాన్‌లో ప్రస్తుతం నేషనల్ టీ20 కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో ఒక జట్టుకి కెప్టెన్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతుండగా ఓ జర్నలిస్ట్ ‘శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడి దేశ ప్రజల్ని బాధపెట్టారు. సిరీస్‌లో మీ చెత్త బ్యాటింగ్ ప్రదర్శన చూసిన తర్వాత ఇకపై ఎవరైనా మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకి వస్తారా..?’ అని ఘాటుగా ప్రశ్నించాడు. దీంతో.. సమాధానం చెప్పలేక సర్ఫరాజ్ మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కూడా సదరు జర్నలిస్ట్ ప్రశ్నలు కురిపించాడు. కానీ.. మౌనమే సర్ఫరాజ్ సమాధానమైంది. ఆ తర్వాత మిగిలిన జర్నలిస్ట్‌లు కూడా అదే తరహాలో ప్రశ్నలు గుప్పించడంతో కొద్దిసేపటి తర్వాత సర్ఫరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మీడియా సమావేశంలో సర్ఫరాజ్‌ని ఏకిపారేసిన జర్నలిస్ట్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చర్యలు తీసుకుంది. అతనికి ఉన్న అక్రిడేషన్‌ని రద్దు చేయించడంతో పాటు ఇకపై పైసలాబాద్‌లోని ఇక్బాల్ స్టేడియంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. వరల్డ్‌కప్ సమయంలోనూ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల వెనుక ఆవలింతలతో పాక్ మీడియా నుంచి సర్ఫరాజ్ ఘాటు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements