ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తాజాగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్కి ధోనీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ ఏడాది డిసెంబరులో వెస్టిండీస్తో జరిగే సిరీస్లోనూ ఈ మాజీ కెప్టెన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.ధోనీ రిటైర్మెంట్ సందిగ్ధతపై తాజాగా షేన్ వాట్సన్ మాట్లాడుతూ ‘ధోనీ ఇప్పటికీ వికెట్ల మధ్య చురుగ్గా పరుగెత్తగలుగుతున్నాడు. కీపింగ్లోనూ అతనికి తిరుగులేదు. కానీ.. రిటైర్మెంట్ గురించి ఇప్పుడు ఆలోచించక తప్పదు. వీడ్కోలు విషయంలో అతను ఏ నిర్ణయం తీసుకున్నా.. అది సరైనదే. ఎందుకంటే భవిష్యత్ ఎలా ఉండబోతుందో..? ధోనీకి బాగా తెలుసు’ అని వాట్సన్ వెల్లడించాడు. కాగా వాట్సన్ కు సంభందించిన సోషల్ మీడియా ఖాతాలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లు హ్యాక్ కు గురయ్యాయి. మొదట ట్విట్టర్ ఖాతా హ్యాక్ కాగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ను హ్యాక్ చేసారు. అంతేకాక హ్యాక్ చేసిన ఖాతాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో ఇప్పటికే వాట్సన్ ఆ ఖాతా నుండి అనేక మంది ఫాలోవర్లను కోల్పోయాడు. అయితే దీనికి సంభందించి వాట్సన్ తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వివరించాడు.