జగన్‌కు అనుభవం లేదు: జేసీ

     Written by : smtv Desk | Tue, Oct 15, 2019, 11:46 PM

 జగన్‌కు అనుభవం లేదు: జేసీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనపై చెప్పాలంటే మరో ఆరు నెలలు గడవాలి అని అభిప్రాయపడ్డారు. మోదీ మంత్రదండం కారణంగానే జగన్ అధికారంలోకి వచ్చారని.. జగన్‌కు అనుభవం లేదని.. మంచి, చెడు చెప్పేవారు లేరు అన్నారు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అనే వ్యవహారంతో.. జగన్ మంచి, చెడు రెండూ చేస్తున్నారు అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు.గతంలో కూడా జేసీ దివాకర్‌రెడ్డి జగన్2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఆయన మూడు నెలల పాలనకు 100కి 100 మార్కులు ఇచ్చారు. కొన్ని నిర్ణయాల్లో తప్పటడుగులు వేస్తున్నారని.. అవసరమైతే జగన్‌కు తాను సలహాలు ఇచ్చేందుకు సిద్ధమని పరోక్షంగా చెప్పారు. అంతేకాదు రివర్స్ టెండరింగ్ విషయంలో పొగడ్తలు కురిపిస్తూనే కాస్త చురకలు అంటించారు. మరోసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు.





Untitled Document
Advertisements