ఉబెర్ డ్రైవర్పై ఇద్దరు దుండగులు దాడి చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తా పూర్తి వివరాల ప్రకారం... రాకేష్ విజయన్ ఉబెర్ క్యాబ్ నడుపుకుంటున్నాడు. సోమవారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో త్రిస్సూర్ బస్టాంగ్ నుంచి క్యాబ్ను ఓ వ్యక్తి బుక్ చేశాడు. వెంటనే రాకేష్ కారుతో అక్కడికి చేరుకున్నారు.. తర్వాత ఇద్దరు లోపలికి ఎక్కారు. కారు పుదుక్కాడ్కు చేరుకోగానే.. వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు డ్రైవర్ రాకేష్పై దాడి చేశారు. అతడ్ని బెదిరించే ప్రయత్నం చేశారు.. కొద్దిసేపు వారితో పోరాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వారిద్దరూ అతడి తలపై ఇనుప రాడ్తో కొట్టారు.. అతడ్ని బయటకు తోసేసి.. కారు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకొని గాయపడిన రాకేష్ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దగ్గరలోని సీసీ ఫుటేజ్తో పాటూ ఉబెర్ యాప్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే క్యాబ్ను ఘటన జరిగిన కొద్ది దూరంలోనే వదిలేసి వెళ్లిపోయారు. వేలి ముద్రలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించే పనిలో ఉన్నారు. కారు తీసుకెళ్లాలని భావించినా.. పోలీసుల భయంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.