కల్యాణ్ జువెలర్స్ దీపావళి ఆఫర్‌...కస్టమర్లకు ఏకంగా 3 లక్షల గోల్డ్ కాయిన్స్

     Written by : smtv Desk | Tue, Oct 15, 2019, 11:54 PM

కల్యాణ్ జువెలర్స్ దీపావళి ఆఫర్‌...కస్టమర్లకు ఏకంగా 3 లక్షల గోల్డ్ కాయిన్స్

ప్రముఖ జువెలరీ బ్రాండ్ కల్యాణ్ జువెలర్స్ తాజాగా దీపావళి ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు ఏకంగా 3 లక్షల గోల్డ్ కాయిన్స్ అందిస్తోంది. సంస్థ ప్రతి వారం లక్కీడ్రా నిర్వహించనుంది. ఇందులో విజేతగా నిలిచిన వారు 100 బంగారు నాణేలను గెలుచుకోవచ్చు.అలాగే సంస్థ బంగారు ఆభరణాలపై తయారీ చార్జీలను రూ.199 నుంచే వసూలు చేస్తోంది. అంతేకాకుండా ప్రతి 8 గ్రాముల బంగారం జువెలరీ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే స్టడెడ్ జువెలరీ కొనుగోలుపై ఉచిత గోల్డ్ కాయిన్స్ ఆఫర్ చేస్తోంది.‘‘దీపావళి అంటే శ్రేయష్కరమైన రోజు. కొత్త ఆరంభానికి చిహ్నం. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు పవిత్రమైన రోజు. పండుగ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని కస్టర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించాం. కస్టమర్లకు అదనపు విలువ చేకూర్చడమే తమ లక్ష్యం’’ అని కల్యాణ్ జువెలర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ కల్యాణరామన్ తెలిపారు.కల్యాణ్ జువెలర్స్ అంతేకాకుండా తన షోరూమ్‌లలో కస్టమర్లు కొనుగోలు చేసిన బంగారు నగలపై 4 లెవెల్ అస్యూరెన్స్ సర్టిఫికేషన్ అందిస్తోంది. అంటే నాణ్యత విషయంలో ఎలాంటి దిగులు అవసరం ఉండదు. అన్ని నగలకు బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటుంది. అలాగే సంస్థ షోరూమ్‌లలో కొనుగోలు చేసిన జువెలరీకి లైఫ్‌టైమ్ మెయింటెన్స్ సదుపాయం వర్తిస్తుంది.కల్యాణ్ జువెలర్స్ బంగారు ఆభరణాల కొనుగోలుపై మాత్రమే కాకుండా ఇంకా బిగ్ డైమండ్ సేల్ కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా డైమండ్ ఆభరణాలపై 20 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. ఇకపోతే నవంబర్ 30 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.





Untitled Document
Advertisements