రవిప్రకాశ్ పై కేసు పెట్టిన న్యాయవాది

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 08:18 AM

రవిప్రకాశ్ పై కేసు పెట్టిన  న్యాయవాది

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై మరో కేసు నమోదయ్యింది. వెబ్‌ ఛానెల్స్‌లో తనపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై మంగళవారం (అక్టోబర్ 15) ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్‌పై తాను ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా.. తప్పుగా ఫిర్యాదు చేసినట్లు వెబ్‌ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రవిప్రకాశ్ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు ఫిర్యాదు చేశారని.. ఆ విషయంలో తన ప్రమేయం లేకున్నా, ఆ ఫిర్యాదు కాపీ తనదే ఆంటూ ఆసత్య ప్రచారం చేస్తున్నారని రామారావు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.తన పరువుకు భంగం కలిగించిన రవిప్రకాశ్ మీడియా హౌస్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు రామారావు తెలిపారు. రామారావు నెల కిందట పంపిన లేఖనే తాజాగా విజయసాయి రెడ్డి తన లెటర్ హెడ్‌పై పంపించారని ఆరోపిస్తూ రవిప్రకాశ్‌కు చెందిన వెబ్ ఛానెళ్లలో కథనాలను ప్రచురించారు.





Untitled Document
Advertisements