కోడెల కుమారుడికి రూ.కోటి ఫైన్...అక్రమంగా 40 వేల టూవీలర్‌ వాహనాలు అమ్మకం!

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 08:48 AM

కోడెల కుమారుడికి రూ.కోటి ఫైన్...అక్రమంగా 40 వేల టూవీలర్‌ వాహనాలు అమ్మకం!

మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాంకు గట్టి షాక్ తగిలింది. శివరాంకు సంభందించిన గౌతమ్ హోండా షోరూంలో నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరిపినట్టు తేలడంతో అధికారులు షోరూంను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే హోల్‌సేల్‌‌గా వాహనాలను కొనుగోలు చేసి, ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా వాటి అమ్మినట్లు అధికారులు నిర్థారించారు. దాదాపు 40 వేల టూ వీలర్‌ వాహనాలకు పన్నులు ఎగవేసినట్టు అధికారులు గుర్తించారు. తాజాగా ఈ వ్యవహారంలో రవాణా శాఖ అధికారులు గౌతమ్ షోరూమ్‌కు భారీ జరిమానా విధించారు. మొత్తం కోటి రూపాయల చెల్లించాలని ఆదేశించారు. ఆర్టీఏ రూల్స్ ఉల్లంఘించి టూ వీలర్స్ అమ్మకాలు జరిపారు అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీఏ విధించిన రూ.కోటి జరిమానాను చెల్లించడానికి శివరామ్ సైతం అంగీకరించారు. ఇదే విషయాన్ని‌ కోర్టుకు తెలియజేసిన ఆయన.. రెండు రోజుల్లోగా చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. గౌతమ్ హీరో హోండా షోరూంలో టీఆర్‌ లేకుండా బైక్‌లు డెలివరీ చేస్తున్నట్టు గతంలోనే అనేక ఫిర్యాదులు అందాయి. అయితే వీటిపై పెద్దగా పట్టించుకోని అధికారులు ప్రభుత్వం మారడంతో విచారణ చేపట్టారు. గత ఏడాది కాలంలో టీఆర్‌ లేకుండా 1,025 బైక్‌లు విక్రయించినట్లు విచారణలో గుర్తించారు. టీఆర్, లైఫ్‌ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్‌ తదితర ఫీజుల కింద ఒక్కో బైక్‌కు సగటున రూ.8వేల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేసిన శివరామ్‌ ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదని తేలింది. కోడెల శివరాం షోరూమ్‌లో విచారణ అనంతరం గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం 1,025 బైక్‌లు టీఆర్‌ లేకుండా విక్రయించి 1989 కేంద్ర మోటర్‌ వాహన చట్టం నిబంధన 42ను కోడెల శివరామ్‌ అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కోడెల శివరామ్‌పై ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్‌ల కింద నమోదు చేశారు.





Untitled Document
Advertisements