కొత్త రూల్స్‌ను తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం

     Written by : smtv Desk | Fri, Oct 18, 2019, 11:29 PM

కొత్త రూల్స్‌ను తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్‌పై ప్రతికూల ప్రభావం చూపే చట్టాలను సరళీకరిస్తూ వస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఒకటి తీసుకుంది. సామాజిక భద్రత 2019లోని కొత్త కోడ్‌తో లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కల్పించాలని చూస్తోంది. దీనికి సంబంధించి ఒక ముసాయిదాను కూడా విడుదల చేసింది. అక్టోబర్ 25 వరకు ప్రజలు దీనిపై సలహాలు, సూచనలు తెలియజేయవచ్చు.మోదీ సర్కార్ ఈ సోషల్ సెక్యూరిటీ 2019 కోడ్‌ను బిల్లు రూపంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టొచ్చు. డ్రాఫ్ కోడ్‌లోని ఒక నిబంధన వల్ల ఉద్యోగులకు లాభం చేకూరనుంది. దీని ప్రకారం ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిండెంట్ ఫండ్ స్కీమ్ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)కు సులభంగానే మారిపోవచ్చు. డ్రాఫ్ట్‌ కోడ్‌లో ఎంప్లాయీస్ ప్రావిండెంట్ ఫండ్ పేరుతో ఉన్న చాప్టర్ 3లోని సెక్షన్ 18 (1)లో ఈ విషయం ఉంది.తొలిసారి ఉద్యోగంలో చేరే వారు ఎలాంటి అప్లికేషన్ లేకుండానే ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు. అలాగే ఎన్‌పీఎస్‌లో చేరిన వారు ఎంప్లాయీస్ ప్రావిండెంట్ ఫండ్ స్కీమ్, పెన్షన్ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్‌ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్‌పీఎస్‌లో చేరిన వ్యక్తి మళ్లీ కావాలనుకుంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లోకి వెనక్కు రావొచ్చు.ఇకపోతే ఈపీఎఫ్ ఎన్‌పీఎస్ ట్రాన్స్‌ఫర్ గురించి గత కొంత కాలంగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేసి ప్రజల అభిప్రాయాలను కోరింది. కేంద్రం దీన్ని పార్లమెంట్‌లో బిల్లుగా తీసుకువచ్చి ఆమోదం లభించిన తర్వాత ఈ ప్రతిపాదనలు అన్నీ అమలులోకి వస్తాయి.





Untitled Document
Advertisements