అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫేజ్-2 రాతపరీక్ష హాల్టికెట్లను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రూల్ నెంబర్, పాస్వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.పరీక్ష రోజు వరకు హాల్టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. షెడ్యూలు ప్రకారం నవంబరు 7న కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 20న నోటిఫికేషన్ విడుదల చేసిన గతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మే 30 నుంచి జూన్ 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు జులై 30, 31 తేదీల్లో ప్రిలిమినరీ (ఫేజ్-1) పరీక్ష నిర్వహించారు.దేశవ్యాప్తంగా మొత్తం 42 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరబాద్, గుంటూరు నగరాల్లో పరీక్ష నిర్వహించారు. ఫేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన వారికి నవంబరు 7న మెయిన్ (ఫేజ్-2) పరీక్ష నిర్వహించనున్నారు.