పసిడి ధర పెంపు...వెండి మరింత పెంపు!

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 10:17 AM

పసిడి ధర పెంపు...వెండి మరింత పెంపు!

బంగారం ధర రోజురోజుకి పెరుగుతూ పోతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.20 పెరిగింది. దీంతో ధర రూ.40,020కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.20 పైకి కదిలింది. దీంతో ధర రూ.36,680కు చేరింది. పసిడి ధర ధర స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగానే పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,000కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర నిలకడగానే ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.38,650 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.37,450 వద్ద నిలకడగా కొనసాగుతోంది.బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. కేజీ వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. రూ.500 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్‌కు 0.33 శాతం తగ్గుదలతో 1,493.35 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.24 శాతం క్షీణతతో 17.57 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements