పాలపొడిని డ్రగ్స్ గా భావించి వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 10:25 PM

పాలపొడిని డ్రగ్స్ గా భావించి వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష

పోలీసుల పొరపాటు వల్ల ఓ వ్యక్తి జీవితంలో ఓ చెరగని మచ్చ పడింది. వారు చేసిన పనికి అ వ్యక్తి జైలు పాలయ్యాడు. ఓక్లహోమాకు చెందిన కాడీ గ్రెగ్ (26) ఆగస్టు 12న సైకిల్ మీద వెళ్తుండగా పోలీసులు అడ్డగించారు. తన సైకిల్‌కు హెడ్‌లైట్లు లేవనే కారణంతో జరిమానా వేస్తారనే భయంతో.. వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు.అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాక్‌ప్యాక్(బ్యాగ్)లో తెల్లని పొడి కనిపించడంతో అతడు డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నాడని భావించారు. అతడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రాథమిక విచారణలో అతడు తీసుకెళ్తున్న పొడి డ్రగ్స్ అని పోలీసులు తేల్చారు. అది పాలపొడి అని కాడీ వాదించినా పట్టించుకోలేదు. దీంతో న్యాయమూర్తి కాడీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు.కాడీ విజ్ఞప్తి మేరకు ఆ డ్రగ్స్‌ను ల్యాబ్‌లో పరిశీలించాలని ఆదేశించారు. ఎట్టకేలకు ఆ రిపోర్టులో అది పాలపొడి అని తేలింది. దీంతో కోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. పోలీసులు కాడీని అక్టోబరు 11న జైలు నుంచి విడుదల చేశారు. ఇటీవల ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడిని కూడా పోలీసులు ఇదే విధంగా అరెస్టు చేశారు. అతడి కారులో ఇంజిన్లో ఉన్న పావురం రెట్టను డ్రగ్స్‌గా భావించి అరెస్టు చేశారు. ల్యాబ్ పరీక్షల్లో అది డ్రగ్ కాదని తేలడంతో అతడిని విడుదల చేశారు.





Untitled Document
Advertisements