కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హర్యానాలోని మహేంద్రగడ్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వస్తున్నప్పుడు హెలికాప్టర్ అత్యవసర పరిస్థితిలో కేఎల్పీ కాలేజ్ గ్రౌండ్లో దిగింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన కాసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆ మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులను రాహుల్ కలిశారు.తాను బ్యాట్ పట్టి.. వారితో కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. క్రికెట్లో అనుభవం ఉన్నట్లుగా రాహుల్ బాగానే బ్యాటింగ్ చేశారు. షాట్లు కొడుతూ అలరించారు. కొద్దిసేపటి తర్వాత ఢిల్లీకి బయల్దేరారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలోనే వెళ్లారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గోవల్సి ఉంది. అనారోగ్య పరిస్థితులు వల్ల ఆమె రాకపోవడంతో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.