హిట్మ్యాన్ రోహిత్ శర్మ మరో సారి చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదురుకుంటున్న రాహుల్ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు.రోహిత్ శర్మ250 బంతుల్లో 205(28 ఫోర్లు, 5 సిక్సులు) టెస్టుల్లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో హిట్మ్యాన్ శనివారం సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం లంచ్ విరామానికి ముందు 199 పరుగులకు చేరుకున్నాడు. భోజనం తర్వాత సిక్స్ తో డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. మరో ఎండ్లో జడేజా నిలకడగా ఆడుతున్నాడు. అంతకుముందు నాలుగో వికెట్కు 267 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించిన రోహిత్, రహానే జోడీని జార్జ్ లిండే విడగొట్టాడు. 115 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రహానే పెవిలియన్ చేరాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో హిట్మ్యాన్(176, 127) రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలతో చెలరేగాడు. ఇక ఈ మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ చేయడం విశేషం..