తల్లి కళ్ల ముందే పిల్లల తలలు నరికిన దొంగ!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 06:19 PM

తల్లి కళ్ల ముందే పిల్లల తలలు నరికిన దొంగ!

ఇంట్లో దొంగతనం కోసం వెళ్ళిన దొంగలు దారుణానికి ఒడిగట్టారు. పిల్లలని కూడా చూడకుండా క్రూరంగా హత్య చేశారు. తల్లి కళ్ల ముందే పిల్లల తలలను వేరు చేశారు. ఆ తర్వాత ఆమెను కూడా హత్య చేసి తలను శరీరం నుంచి వేరు చేసేందుకు ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన అమెరికాలోని అర్కాన్సాస్‌లో చోటుచేసుకుంది.మైకెల్ కల్లిన్స్ (26) బర్నెల్ అలగ్జాండర్ (23) అనే ఇద్దరు అన్నదమ్ములు ఓ అపార్ట్‌మెంట్‌లోని మారియా కన్నింగ్హం (24) ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో డబ్బు, విలువైన సామాన్లు ఇవ్వాలంటూ మారియాను బెదిరించారు. ఆమె నిరాకరించడంతో ఆమె పిల్లలు లైలియా ఫిషర్(5), ఆమె తమ్ముడు ఎలిజా(4)ను చంపేస్తామని బెదిరించారు. మైకెల్.. లైలియాను 20 సార్లు కత్తితో పొడిచి తలను సగానికి పైగా నరికేశాడు. ఆ తర్వాత ఎలిజాను 14 సార్లు కత్తులతో పొడిచి తలను పూర్తిగా శరీరం నుంచి వేరు చేశారు. ఈ దారుణాన్ని తన కళ్లతో చూడాలంటూ అలగ్జాండర్ వారి తల్లిని ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత ఆమెను కూడా చంపేశాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో వారికి ఎలాంటి విలువైన వస్తువు, డబ్బులు దొరకలేదు. దీంతో టీవీ మాత్రమే తీసుకెళ్లారు.2017 డిసెంబరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఇటీవల విచారణకు వచ్చింది. ఈ దారుణంపై న్యాయవాది బార్బరా మరియానా కోర్టుకు వివరిస్తూ.. ‘‘కేవలం ఒక టీవీ కోసం.. ఇంత దారుణానికి ఒడిగట్టారు. వారిని అత్యంత దారుణంగా హత్య చేశారు’’ అని కోర్టుకు తెలిపారు. దీనిపై నిందితుడు మైకెల్ స్పందిస్తూ.. ‘‘ఆమె దనవంతురాలని భావించి ఆ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాం. మాకు కావల్సినవి ఇవ్వడం లేదనే కోపంతో వారిని చంపాల్సి వచ్చింది. ఆ ఇంట్లో ఏమీ లభించలేదు. ఆమె ఆత్మ నన్ను వెంటాడుతోంది’’ అని తెలిపాడు. బార్బరా మాట్లాడుతూ.. ‘‘మారియా మంచి తల్లి, ఆమె తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకొనేది. అందుకే, ఆమె వాళ్లను వెంటాడుతోంది’’ అని తెలిపింది. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతోంది.





Untitled Document
Advertisements