సినిమా కోసం నిజమైన ఖైదీలను కలిశాం!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 06:23 AM

సినిమా కోసం నిజమైన ఖైదీలను కలిశాం!

కార్తి హీరోగా కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ విడుదల చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ...సినిమా మొత్తం మాస్ స్టైల్‌లో ఉంటుంది. యాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక రాత్రి నాలుగు గంటల పాటు జరిగే కథనంతో సినిమా కొనసాగుతుంది. ఆ నాలుగు గంటల్లోనే చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం నా క్యారెక్టరైజేషన్. పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బయటకు వచ్చే ఒక ఖైదీ క్యారెక్టర్ నాది. తాను ఇప్పటివరకూ చూడని ఒక కూతురు ఉంటుంది. తను ఎలా ఉంటుందో కూడా తెలియదు. అన్ని అవాంతరాలను దాటుకొని తన కూతురిని చూడగలిగాడా? లేదా? అనేది కథ. ఇదొక బిగ్ యాక్షన్ ఫిల్మ్.సినిమాలోని డైలాగ్స్‌కు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రతి సీన్ ఫ్రెష్‌గా ఉంటుంది. సినిమా ఒక న్యూ ఏజ్ యాక్షన్ ఫిలింలా ఉంటుంది. కానీ నా క్యారెక్టర్ మాత్రం మాస్‌గా ఉంటుంది.ఇలాంటి ఒక మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నపుడు మ్యూజిక్ అనేది చాలా ముఖ్యం. అందులోను ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టడమనేది కొత్త ఆలోచన. హాలీవుడ్ మూవీ తరహాలో మ్యూజిక్ ఉంటుంది.ఈ సినిమాకు కోసం మేము నిజమైన ఖైదీలను కలవడం జరిగింది. వారిని కలిసినప్పుడు చాలా కొత్త విషయాలు చెప్పారు. చాలా కాలం జైలులో ఉండి బయటకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందని ఖైదీలు చెప్పడం జరిగింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 60 రాత్రులు షూటింగ్ చేశాం. సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.





Untitled Document
Advertisements