కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఢిల్లీ పబ్లిక్స్కూల్(డీపీఎస్)లో గత మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ క్రీడాపోటీలు ఆదివారం ముగిశాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బౌరంపేటలోని ఢిల్లీ పబ్లిక్స్కూల్(డీపీఎస్)లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 65వ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యం లో జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తతంగా వివిధ జిల్లాల నుంచి 240మంది 14 ఏండ్లలోపు బాల,బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో కరీంనగర్ జట్టు ద్వితీయస్థానంలో నిలువగా, హైదారాబాద్ జట్టు తృతీయస్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు ద్వితీయస్థానంలో నిలువగా ఉమ్మడి మెదక్జట్టు మూడోస్థానంలో నిలిచింది.