ఇంటిని వదిలి ముగ్గురితో ఎఫైర్ .. ఆ తర్వాత హత్య ?

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 03:40 PM

కర్ణాటకలోని హాసన్ పట్టణంలోని ఒక హోటల్ లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. బొమ్మనహళ్లి జిల్లా అరుకలగూడుకు చెందిన భవిత(23) అనే యువతి హాసన్ పట్టణంలోని ఓ హోటల్‌లో నిన్న శవమై కనిపించింది. ఆమెతో కలిసి హోటల్‌కు వచ్చిన వ్యక్తి పరారు కావడంతో అతడే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భవిత 18ఏళ్ల వయస్సులో అంటే ఐదేళ్ళ క్రితం ఓ యువకుడితో ప్రేమలో పడగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను మేజర్‌నని, ప్రియుడితోనే ఉంటానని యువతి చెప్పడంతో పేరెంట్స్‌ ఆమెను పట్టించుకోవడం మానేశారు. నిఇన్న హాసన్ పట్టణంలోని సరయు హోటల్ సమీపంలో భవిత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. భవిత 12రోజుల క్రితం సరయు హోటల్‌లో దిగినట్లు తెలుస్తోంది. ఆమె చేతిపై పునీత్ అనే పేరుతో పచ్చబొట్టు ఉంది. శనివారం రాత్రి పునీత్ అనే యువకుడు భవిత గదికి వచ్చినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో అతడే భవితను చంపేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే భవిత ఇప్పటివరకు ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాళ్లలో ఎవరైనా కక్షతో ఆమెను హత్య చేశారా? లేక వారి గురించి తెలిసి వినీత్ అనే యువకుడు ఆమెను హత్య చేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements