ప్రియురాలికి ‘ప్రేమ పరీక్ష’...బెడిసికొట్టడంతో జైల్లో ప్రియుడు

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 10:53 PM

ప్రియురాలికి ‘ప్రేమ పరీక్ష’...బెడిసికొట్టడంతో జైల్లో ప్రియుడు

ప్రేమికురాలికి ప్రేమ పరీక్ష పెడుదామనుకున్న ఓ ప్రేమికునికి ఊహించని షాక్ ఎదురయ్యింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ చెందిన మేహుల్ జోషీ(23) తన ప్రియురాలు ఇషాతో సహజీవనం చేస్తున్నాడు. అయితే, అతడికో తుంటరి ఆలోచన ఒకటి వచ్చింది. ఆమెకు తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనే కోరిక పుట్టింది.ఇంకేముంది.. ఓ కొత్త డ్రామాకు తెరతీశాడు. ఈ ప్లాన్‌తో సరదాగా ఆమెను ఆటపట్టించవచ్చని భావించాడు. ఇందుకు తనని తానే కిడ్నాప్ చేసుకున్నాడు. ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి జోషి.. తన ఫోన్‌లో కొత్త సిమ్ వేసుకుని ఆమెకు ఫోన్ చేశాడు. ‘‘నీ ప్రియుడిని కిడ్నాప్ చేశాం. అతడిని తిరిగి అప్పగించాలంటే రూ.లక్షలు తీసుకునిరా’’ అని బెదిరించాడు. వాయిస్ చేంజ్ యాప్ ద్వారా మాట్లాడటం వల్ల ఇషా గుర్తుపట్టలేకపోయింది. దీంతో ఇషా పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు రంగంలోకి దిగి అతడి ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేశారు. కిడ్నాపర్లు గాంధీధామ్‌లోని ఓ లాడ్జిలో ఉన్నాడని తెలుసుకున్నారు. అప్పటికే జోషి లాడ్జి నుంచి బయటకు వచ్చి స్థానిక బస్టాండ్‌లో నిలుచున్నాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. ఇషా తనని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకొనేందుకే ఈ నాటకం ఆడానని తెలిపాడు. అయితే, ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించాడనే కారణంతో జోషిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 182 కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.





Untitled Document
Advertisements