అతిథిగా వెళ్లి ప్రిన్సిపల్‌కు జరిమానా విధించారు!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 11:15 PM

అతిథిగా వెళ్లి ప్రిన్సిపల్‌కు జరిమానా విధించారు!

స్కూల్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రిన్సిపల్‌కు జరిమానా విధించారు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తీ వివరాల ప్రకారం...అటవీ శాఖతో కలిసి ఓ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసిన బయోడైవర్సిటీపై క్విజ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చోటే సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 57 పాఠశాలలకుపైగా విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులను సత్కరించడం కోసం పూలదండలను నిషేధిత ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్.. అందరి ముందూ ఆ స్కూల్ ప్రిన్సిపల్‌‌కు రూ.1000 జరిమానా విధించారు. కలెక్టర్ చేసిన పనికి సభకు హాజరైన వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులో పూలమాలలను తెప్పించారని.. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని ఇచ్చారని కలెక్టర్ ఓ మీడియా ప్రతినిధికి తెలిపారు. పర్యావరణం గురించి అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో.. వందలాది మంది విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ఇలా జరగడం తనను బాధించిందని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలు పంపుతాయన్నారు.





Untitled Document
Advertisements