బిజెపిలో చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి విర్క్: రాహుల్

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 06:49 AM

బిజెపిలో చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి విర్క్: రాహుల్

ప్రజలు ఇవిఎంలో ఏ బటన్ నొక్కినా ఓట్లు మాత్రం అధికార పార్టీ బిజెపికే వెళ్తాయని హర్యానా బిజెపి అభ్యర్థుల్లో ఒకరు చెప్పడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. హర్యానాలో 90 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. బిజెపి అభ్యర్థి మనోహర్ లాల్ ఖత్తర్ రెండవసారి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అస్పంధ్ సీటు ఎమ్‌ఎల్‌ఎ బక్షిస్ సింగ్ విర్క్ వీడియో క్లిప్పింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ ఇవిఎం పనితీరుపై రాహుల్ బిజెపిలో చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి విర్క్ అని వ్యాఖ్యానించారు. అయితే విర్క్ అది బూటకపు వీడియో అని, తనను, బిజెపిని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రత్యర్థులు పన్నిన పన్నాగమని వ్యాఖ్యానించారు. ఈ వీడియో వెలుగు లోకి వచ్చిన తరువాత ఎన్నికల కమిషన్ విర్కుకు నోటీసు జారీ చేసింది. అస్పంధ్ నియోజక వర్గానికి మాజీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ను పంపించింది. అక్కడ ఎన్నికలు సజావుగా సాగడానికి తగిన చర్యలు ఆ ఎన్నికల కమిషన్ ప్రతినిధిని తీసుకోవాల్సిందిగా అభ్యర్థించినట్టు ఇసి ప్రకటనలో పేర్కొంది.





Untitled Document
Advertisements