లక్ష పెడితే కోటీ...ఇన్వెస్టర్ల పంట పండింది

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 12:10 PM

లక్ష పెడితే కోటీ...ఇన్వెస్టర్ల పంట పండింది

దేశీయ అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్ రూ.లక్షను రూ.కోటిగా మార్చింది. ఆ స్కీమ్ పేరు యూటీఐ మాస్టర్‌షేర్ యూనిట్. 2019 అక్టోబర్ 15 నాటికి ఈ ఫండ్ స్కీమ్ 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూటీఐ మాస్టర్‌షేర్ యూనిట్ స్కీమ్‌ను 1986 అక్టోబర్ 15న లాంచ్ చేశారు. ఇది ఒక లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు 15.62 శాతంగా ఉంది. అంటే ఫండ్ అదుబాటులోకి వచ్చిన రోజున ఈ స్కీమ్‌లో రూ.82,988 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు మీ డబ్బు రూ.కోటిగా మారి ఉండేది.ఈ మ్యూచువల్ ఫండ్ లాంచ్ డేట్ నుంచి చూస్తే రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇన్వెస్టర్లకు 120 రెట్లు రాబడి లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫండ్ 33వ వార్షికోత్సం రోజున మీ చేతిలో రూ.1.2 కోట్లు ఉండేవి. యూటీఐ మాస్టర్‌షేర్ యూనిట్ స్కీమ్ అనేది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ ఫండ్‌ మన డబ్బులను లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట చేస్తుంది. ఈ ఫండ్‌ నిర్వహణ బాధ్యతలను ఆరంభం నుంచి స్వాతి కులకర్ణి చూసుకుంటూ వస్తున్నారు. గ్రోత్ ఎట్ రీజనబుల్ ప్రైస్ (జీఏఆర్‌పీ) అనే ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. జీఏఆర్‌పీ అంటే కంపెనీ స్టాక్‌ను కొనుగోలు చేసేందుకు ఎంత చెల్లిస్తే సబబుగా ఉంటుందనే వ్యూహంతో షేర్లను కొనుగోలు చేస్తారు. అలాగే కంపెనీ భవిష్యత్ రాబడుల వృద్ధి అంచనా, వ్యాల్యుయేషన్స్ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధంగా ఎంపిక చేసుకున్న స్టాక్స్ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయనే అంచనాలున్నాయి. ఈ స్కీమ్ మార్కెట్ ర్యాలీ సమయంలో ఇతర ఫండ్స్‌ను మించి అదిరిపోయే పనితీరు కనబర్చలేకపోయింది. లార్జ్ క్యా్ప్స్ కారణంగా స్థిరమైన రాబడి ఈ ఫండ్ ప్రత్యేకత. తక్కువ ఒడిదుడుకులు ఉంటాయి. రెగ్యులర్ డివిడెండ్, మూలధన పెరుగుదల వంటి అంశాలను కోరుకునే వారికి ఈ ఫండ్ అనువుగా ఉంటుంది.





Untitled Document
Advertisements