రైలు ప్రయాణీకులకు రూ.25 లక్షల ఉచిత ఇన్సూరెన్స్!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 07:58 PM

రైలు ప్రయాణీకులకు రూ.25 లక్షల ఉచిత ఇన్సూరెన్స్!

రైలు ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ మరో శుభవార్త అందించింది. ట్రైజ్ జర్నీ చేసే వారికి రూ.25 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంది. అయితే అన్ని ట్రైన్లకు ఇది వర్తించదు. కేవలం ఐఆర్‌సీటీసీ ప్రైవేట్‌గా నడుపుతున్న లక్నో - ఢిల్లీ ట్రైన్‌కు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.లక్నో-ఢిల్లీ తేజాస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. జర్నీ చేసేటప్పుడు ఇంట్లో దొంగతనం జరిగితే వాటికి రూ.లక్ష వరకు బీమా లభిస్తుంది. అలాగే ప్యాసింజర్లకు రూ.25 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ వస్తుంది. అంతేకాకుండా ట్రైన్ గంటకు పైగా ఆలస్యంగా వస్తే పరిహారం కూడా చెల్లిస్తారు. అంతేకాకుండా ప్యాసింజర్లకు రిఫండ్ పాలసీ కూడా ఉంది. ఇంకా ఇంటి వద్దకే వచ్చి బ్యాగేజ్‌ను పికప్ చేసుకుంటారు. అలాగే ట్రైన్‌లో ఫుడ్ కూడా ఆర్డర్ ఇవ్వొచ్చు. క్యాన్సలేషన్ చార్జీలు కూడా తక్కువగానే ఉన్నాయి. కాఫీ, టీ మెషీన్లు కూడా ట్రైన్లలో ఉంటాయి. ఆర్‌వో మెషీన్లతో వాటర్ కూడా సరఫరా చేస్తారు. విమానంలో మాదిరి ఈ ట్రైన్‌లోనూ ఫుడ్‌ను ట్రాలీ మీద తీసుకువచ్చి మీకు అందజేస్తారు. ట్రైన్ గంటలకు పైగా ఆలస్యమైతే రూ.100 ఇస్తారు. అదే 2 గంటలకు పైగా ఆలస్యమైతే రూ.250 ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారు. ఐదేళ్లకు పైన ఉన్న పిల్లలకు కూడా ఫుల్ టికెట్ చార్జీలు పడతాయి.





Untitled Document
Advertisements