సినీనటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. పిల్లలతో దిగిన ఫోటోలను పోస్ట్ చేయడం తో పాటు. సామజిక అంశాలపై కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తనలోని కవియిత్రిని నిద్ర లేపారు రేణు. రేణు దేశాయ్ చాలా కాలంగా కవితలు రాస్తూ ఉంది. వాటిని తెలుగులో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తో ట్రాన్స్ లేట్ చేస్తుంటారు. తన కవితల్లోంచి ఒక కవితను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.చాలా ఎమోషనల్ గా రేణుదేశాయ్ రాసిన ఈ కవిత సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ కవిత పై మీరు ఓ లుక్కెయ్యండి.
నా ఆత్మ సంచరిస్తోంది ఈ పెనుగాలుల్లో వివస్త్రగా విపాదరక్షగా
తన ఉనికిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటోంది నన్ను నా రక్తంలో పరిమితం చేయకు
నా ప్రాణ వాహినిలా నాకు స్వేచ్ఛగా ప్రవహించాలనుంది
తెరలు తెరలుగా వచ్చి బలంగా తాకే వెచ్చటి గాలుల్లో ఈకలా అలా అలా తేలిపోతుంది ఇప్పుడు నా హృదయం
మెరుపు జాడని వెతుక్కుంటూ వెళ్లే జల్లెడ లాంటి మేఘంలా ఉంది
నన్ను ఆపకు - నా నెత్తుటిని ఉబకనివ్వు నేను పరవళ్లు తొక్కాలి - నేను పైపైకెగరాలి నేను కదలాలి - నేను కురవాలి విత్తనమై నేలమ్మ కడుపులో మళ్లీ మొలకెత్తాలి
మళ్లీ వికసించడానికి - మళ్లీ విహరించడానికి