తెలుగు రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 08:42 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో మంగళ, బుదవారం రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. అదీగాక తూర్పు మద్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ రెండిటితో పాటు భూమికి 4.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కారణంగా ద్రోణి కూడా ఏర్పడింది. ఒకేసారి వాతావరణంలో ఇన్ని మార్పులు జరుగడంతో రానున్న రెండు రోజులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు మొదలయ్యాయి. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివశిస్తున్నవారు, రైతులు, ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేసుకోవడం చాలా మంచిది.





Untitled Document
Advertisements