భారత్ కీ లక్ష్మీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఆ ఇద్దరు .. !

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 08:50 PM

భారత్ కీ లక్ష్మి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, స్టార్ షట్లర్ పీవీ సింధు నియమించింది కేంద్రప్రభుత్వం. ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళా సాధికారతను, మహిళల కృషిని చాటే ఉద్దేశంతో భారత్ కీ లక్ష్మి హ్యాష్‌ట్యాగ్‌తో దీపికాపదుకొనే, పీవీ సింధు ఓ వీడియో రూపొందించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతై సప్కాల్ లాంటి వారిని గుర్తు చేస్తూ..ఇలాంటి లక్ష్మిలు ఉన్న ప్రతీ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని వీడియోలో పీవీ సింధు, దీపికా పదుకొనే చెప్పారు.

ఈ వీడియోను మోడీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ దీపావళి సందర్భంగా భారత్ కీ లక్ష్మి కార్యక్రమాన్ని చేపడుతున్నామని మోడీ తెలిపారు. భారత నారీ శక్తి ప్రతిభ, చిత్తశుద్ధి, అంకితభావాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేయమని మన నీతి ఎల్లప్పుడూ మనకు నేర్పిందని మోడీ తెలిపారు. సింధు,దీపాకా పదుకునే ఈ వీడియో ద్వారా భారత్ కీ లక్ష్మీ జరుపుకునే సందేశాన్ని అద్భుతంగా తెలియజేవారని మోడీ మెచ్చుకున్నారు.





Untitled Document
Advertisements