ఏషియన్ సినిమాస్‌పై ఐటీ దాడులు!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 11:56 PM

ఏషియన్ సినిమాస్‌పై ఐటీ దాడులు!

ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యలయాలపై తాజాగా ఐటి దాడులు జరిగాయి. ఏషియన్ సినిమా అధినేతలు నారయణదాస్, సునీల్ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల ఇంట్లల్లో కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఏషియన్ సినిమాస్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో కూడా ఉంది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు అనేక మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు‌తో కలిసి ఏఎంబీ మాల్‌ను ఏషియన్ సినిమాస్ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అతిపెద్ద, లగ్జరీ మల్టీప్లెక్స్ ఇదే. త్వరలో హీరో అల్లు అర్జున్‌తో కలిసి మరో మల్టీ‌ప్లెక్స్ నిర్మాణానికి కూడా ఏషియన్ సినిమాస్ సిద్ధపడుతోంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కతోన్న సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. నైజాంలో ‘బాహుబలి’ లాంటి ఎన్నో భారీ చిత్రాలను ఏషియన్ సినిమాస్ పంపిణీ చేసింది. అయితే, ఐటీ అధికారులు సోదాల్లో ఏం బయటపడ్డాయి అనే విషయంలో ఇంకా స్పష్టతలేదు. ఏషియన్ సినిమాస్ యజమానులు ప్రభుత్వానికి పన్నులన్నీ సక్రమంగా చెల్లించారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements