పండుగ ఆఫర్లు ప్రకటించిన ఎస్‌బీఐ...రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 11:08 AM

పండుగ ఆఫర్లు ప్రకటించిన ఎస్‌బీఐ...రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దీపావళి పండుగ సందర్భంగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌బీఐ దీని కోసం వివిధ ట్రావెల్ కంపెనీలతో జతకట్టింది. క్లియర్‌ట్రిప్, ఈజీమై ట్రిప్, యాత్ర, ట్రావెల్ యారి, రెడ్‌బస్ వంటి పలు సంస్థలు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ దీపావళి బంపరాఫర్లలో భాగంగా ఎస్‌బీఐ యోనో కస్టమర్లు సూపర్ డీల్స్ పొందొచ్చు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఆఫర్ల విషయాన్ని వెల్లడించింది. ‘ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా గ్రేట్ ఆఫర్లు పొందండి. మీ నెక్ట్స్ ట్రిప్‌ను ఈ రోజే బుక్ చేసుకోండి. ఆఫర్ డిసెంబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. యోనో యాప్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’ అని ట్వీట్ చేసింది. ఎస్‌బీఐ ఆఫర్లేంటంటే...
Cleartrip offer: విమాన టికెట్లపై 20 శాతం వరకు ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. గరిష్టంగా రూ.1,000 వరకు మాత్రమే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దేశీ ఫ్లైట్ బుకింగ్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే హోటల్ రిజర్వేషన్స్‌పై రూర.10,000 వరకు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్స్‌పై రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Ease My Trip offer: ఈజీ మై ట్రిప్ పోర్టల్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకుంటే.. ఫ్లైట్ బుకింగ్స్‌పై రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. టికెట్ బుకింగ్ విలువ కనీసం రూ.2,000 ఉండాలి. హోటల్ బుకింగ్స్‌పై రూ.700 వరకు, బస్ బుకింగ్స్‌పై 5 శాతం వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు.
Yatra offer: యాత్ర ప్లాట్‌ఫామ్‌ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకుంటే ఫ్లైట్ బుకింగ్స్‌పై రూ.5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. హోటల్ బుకింగ్స్‌పై 20 శాతం వరకు లేదంటే గరిష్టంగా రూ.1,000 వరకు తగ్గింపు పొందొచ్చు.
Red bus offer: ఆన్‌లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్ బస్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే 5 శాతం ఫ్లాట్ తగ్గింపు పొందొచ్చు. అలాగే ట్రావెల్ యారి ద్వారా బస్ టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం లేదా రూ.120 వరకు తగ్గింపు లభిస్తుంది.





Untitled Document
Advertisements