ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖలు చేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్)ను ప్రధాని మోదీ తన పారిశ్రామిక రంగ స్నేహితులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 'కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' యూనియన్ సభ్యులను కలిసిన రాహుల్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు సమర్పించిన పిటిషన్ను రాహుల్ ట్విటర్లో పోస్టు చేశారు. 'అత్యంత లాభాల్లో ఉన్న కంటైనర్ కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక ఆభరణంలాంటిది. అలాంటి సంస్థను దక్కించుకోవాలని ప్రధాని మోదీ ఆశ్రిత పెట్టుబడిదారి స్నేహితులు కొందరు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ సంస్థను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది' అని ట్విటర్లో పేర్కొన్నారు. కాన్కోర్ యూనియన్కు అండగా ఉండాలని కోరారు.