కర్ణాటకకు చెందిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ఈ రోజు విచారణ చేయనుంది. జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కర్ణాటకలో 15 నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు డిసెంబర్లో జరుగనున్నాయి. దీంతో రెబెల్ ఎమ్మెల్యేలు తాము పోటీ చేయడానికి అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.