ఇసుక విషయంలో ఇబ్బందులున్నాయి.. ప్రభుత్వం అంగీకరిస్తుందన్నారు మంత్రి బుగ్గన. ఇసుక కొరతను కొన్ని రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి బుగ్గన. మీ పాలనలో వర్షాలు లేకపోవడంతో ఇసుకను దోచుకున్నారని టీడీపీపై విమర్శలు చేశారు. వర్షాలు ఎక్కువగా కురవడంతో ఇసుక తవ్వకాలకు ఇబ్బందిగా ఉందన్నారాయన.త్వరలోనే ఇసుక కష్టాలు తీరతాయని అన్నారు.
మరో వైపు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నవన్నీ అబద్దాలేనని విమర్శించారు. గత ప్రభుత్వం అతి దరిద్రమైన ఆర్థిక స్థితిని వారసత్వంగా ఇచ్చిందన్నారు. ఏపీ ర్యాంక్ పడిపోవడానికి యనమలే కారణమని మంత్రి ఆరోపించారు. విద్యుత్ కోతలపై మీడియాలో వస్తున్న వార్తలను మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఖండించారు. పర్యావరణానికి హాని జరుగుతుందనే థర్మల్ విద్యుత్ను తగ్గించామన్నారు. ప్రభుత్వ పథకాలపై టీడీపీ అర్థం లేని విమర్శలు చేస్తోందని ఆరోపించారు.