మనీలాండరింగ్ కేసులో ఊరట

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 05:24 PM

మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డీకే .శివకుమార్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న శివకుమార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో అనేక మార్లు అయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టేసింది. తాజాగా అయన మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది.గతనెల 3 వ తేదీన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజుల వరకు అయన జైల్లోనే ఉన్నారు. డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు కావడంతో కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.





Untitled Document
Advertisements