జగన్ పై హాట్ కామెంట్స్ చేసిన సుజనా చౌదరి

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 05:26 PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై బీజేపీ నేత సుజనా చౌదరి మరో సారిమండిపడ్డారు. ఢిల్లీ పర్యటన చేసి బీజేపీ పెద్దలను కలిసి తిరిగి బీజేపీపై నిందలు వేసే ప్రయత్నం చెయ్యడం సరికాదని అన్నారు. జగన్ దూకుడు పక్కనబెట్టి సరైన సలహాలు తీసుకుని పాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇసుకపైనే కాక.. అన్ని రంగాల్లో విధానాలు సరిగా లేవని విమర్శించారు.

ఏపీ రాజధాని అమరావతిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుజనా అన్నారు. రాజధాని మారుస్తామని ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. అవినీతి ఉంటే చర్యలు తీసుకోవాలి. అంతేకాని ప్రాజెక్టులు నిలిపివేయడం సరికాదన్నారు.ప్రాంతీయ పార్టీల వల్లే చాలా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు నష్టపోయాయని, ప్రాంతీయవాదంతో ఏర్పాటై కుటుంబ పార్టీలుగా మారుతున్నాయని సుజనా చౌదరి విమర్శించారు.





Untitled Document
Advertisements