బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ మాజీ కెప్టెన్ ధోనీ రెటైర్మెంట్ పై స్పందించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ...అది అతని మీద ఆధారపడి ఉంటుంది. నేను టీమిండియా నుంచి బయటికెళ్లిపోయినప్పుడు ప్రపంచమంతా నేను మళ్లీ ఫామ్ లోకి రాలేనన్నారు. నేను తిరిగివచ్చి 4సంవత్సరాలు ఆడాను. ఛాంపియన్లు తొందరగా ముగించరు అని గంగూలీ అన్నారు. ధోని మనసులో ఏముందో, కెరీర్ గురించి అతడు ఏం ఆలోచిస్తున్నాడో తనకు తెలియదన్నారు. ధోని ఒక గొప్ప ఆటగాడన్నారు. ధోనిని చూసి దేశం గర్వపడుతోందన్నారు. ధోని ఏం చేశాడు అని కూర్చొని ఓ పేపర్ మీద రాయడం మెదలుపెడితే మీరు అద్భుతం అని అంటారని,తాను పదవిలో ఉన్నంతకాలం అందరూ గౌరవించబడతారని,అది ఎప్పటికీ మారదని గంగూలీ అన్నారు.క్రెడిబులిటీ విషయంలో కాంప్రమైజ్ అవనని గంగూలీ తెలిపారు. తాను టీమిండియాను లీడ్ చేసిన విధంగానే..ఎలాంటి అవినీతిని దరికి చేరనివ్వనని,అదే విధంగా బీసీసీఐని కూడా అవినీతిరహితంగా ఉంచుతామని గంగూలీ తెలిపారు. ఈ రోజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సందర్భంగా తాను ధరించిన కోటు(బ్లేజర్)టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో తన దగ్గర ఉన్నదని,కోటు చాలా లూస్ అయిన సంగతి తాను గమనించలేదన్నారు.