ప్రియుని కోసం భర్తను చంపాలని చూసిన భార్యకు ఊహించని షాక్ తగిలింది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అంతమొందించాలని పెద్ద ప్లాన్ వేసింది. అయితే ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో తన భర్తతో పాటు ప్రియుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని సూరత్లో జరిగిన ఈ ఘటన పూర్తీ వివరాల ప్రకారం...కోశమ్ కంతారా ప్రాంతంలో వైరవ్ రోడ్డులో ఖుష్బు పటేల్, కమల్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఖుష్బు పటేల్ ప్రభుత్వ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తోంది. ఓ జాబ్ మేళాలలో తుషార్ అనే వ్యక్తితో ఖుష్బుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. దీంతో కమల్తో విడాకులు తీసుకొని తుషార్తో కలిసి జీవించాలనుకుంది. కమల్ విడాకులు తీసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో అతడిని అంతమొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఇవాళ బోర్గా ఉందని బయటకు వెళ్లుదామని భర్తను ఓ చెరువు వద్దకు తీసుకెళ్లింది. అనుకున్న ప్లాన్ ప్రకారం చెరువు వద్దకు రాగానే ఖుష్బు మూత్ర విసర్జన కోసమని దూరంగా వెళ్లింది. ఇంతలోనే తుషార్ వచ్చి కమల్ను చెరువులో తోసేయడానికి ప్రయత్నించాడు. దీంతో కమల్ కూడా తుషార్ ను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు నీళ్లలో పడిపోయారు. ప్రియుడు, భర్త నీళ్లలో మునిగిపోవడంతో ఆమె లబోదిబోమంటూ అరిచింది. వెంటనే స్థానికులు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి తనదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం సూరత్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.