అత్యంత ఖరీదైన చాక్లెట్ ను ఆవిష్కరించిన ఐటిసి

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 07:13 PM

అత్యంత ఖరీదైన చాక్లెట్ ను ఆవిష్కరించిన ఐటిసి

ఐటిసి కంపెనీ తాజాగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చాక్లెట్ ను ఆవిష్కరించింది. దీని ధర కిలోకి రూ.40 లక్షల 30 వేలు. ఫాబెల్లె బ్రాండ్ ట్రినిటీ-ట్రఫుల్స్ ఎక్స్ ట్రార్డినేట్ పేరిట ఈ చాక్లెట్ తయారు చేసింది. ఇవి కస్టమర్లకు చెక్కపెట్టెలో లభించనుండగా, ఒక్కో చెక్కపెట్టలో 15 ట్రఫుల్స్ ఉంటాయని సంస్థ తెలిపింది. దీని బరువు దాదాపు 15 గ్రాములు. ప్రపంచలోనే ఇంత ఖరీదైన చాక్లెట్ లేదు కాబట్టి ఇది గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుందని ఫుడ్ డివిజన్ సిఓఓ అనుజ్ రుస్తాగి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇప్పటికే ఈ కంపెనీ పలు విభాగాల్లో సిగరెట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ నుండి గృహోపకరణాల దాక ఎన్నో బ్రాండ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements