మరోసారి జగన్‌పై జేసీ సెటైర్లు..

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 08:06 PM

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ వైఎస్ జగన్ మా అబ్బాయి అంటూనే.. ఏపీ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. పరిపాలనలో జగన్‌ కిందామీదా పడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంబంధించిన జేసీ.. జగన్ పాలనకు 100కి 150 మార్కులు వేస్తానంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా జేసీ కోపానికి తన ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేయడమేనని స్పష్టంగా అర్థమవుతోంది.. ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా ఆయనకి తమ బస్సులే కనిపిస్తున్నాయని.. 70 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నామని.. చిన్న చిన్న లోటు పాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమేనని.. ఫైన్‌తో పోయే తప్పిదాలను బూతదంలో చూపిస్తూ ఇప్పటి వరకు 31 బస్సులను సీజ్ చేశారని మండిపడ్డారు. ఇక, బస్సుల సీజ్‌పై న్యాయపోరాంట చేస్తానన్న జేసీ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకే తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements