లారీ కంటెయినర్లో 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. లండన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల ప్రకారం...తూర్పు లండన్ లోని ఇండస్ట్రీయల్ ఎస్టేట్ వద్ద ఓ కంటెయినర్ లారీని పోలీసులు తనిఖీ చేయగా 39 మృతదేహాలు బయటపడ్డాయి. అందులో 38 మంది పెద్దవారు, ఒక యువకుడు ఉన్నారు. వెంటనే ఆ లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ మృతదేహాలు ఎవరివి?, లారీలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు?, లారీ డ్రైవర్కు ఆ మృతదేహాలు సంబంధం ఏంటీ? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.