హైదరాబాద్: మార్కులు సరిగా రాలేదని తండ్రి మందలించడంతో 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగింది.
శ్రీ చరణ్ (20) అనే యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత విద్యకు చదివేందుకు సిద్ధమవుతున్నాడు. క్యాట్ రాసి ఏదైనా ఐఐఎంలో ఎంబీఏ చేయాలని కలలు కన్నాడు. అందుకోసం హైదరాబాద్లోని గచ్చిబౌలి పీజేఆర్ నగర్లో ఓ హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ కొద్ది రోజుల్లోనే పరీక్ష ఉందనగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కానీ కోచింగ్లో ప్రాక్టీస్ టెస్లుల్లో మార్కులు సరిగ్గా రాలేదని తండ్రి రతన్ లాల్ అతడిని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీ చరణ్.. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.