మద్యం మత్తులో రెచ్చిపోయిన మహిళా..!

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 03:07 PM

మద్యం మత్తు ఎంత పనైనా చేయిస్తుంది. మత్తులో చాలామంది తమకే తెలియకుండా చాలానే చేస్తుంటారు. మద్యం మత్తు తలకెక్కితే ఆడవారైనా ,మగవారైనా ఒక్కటే కొంతమంది చిందులేస్తరు. మరి కొంత మంది క్రూరంగా ప్రవర్తిస్తారు. అలా ఓ మహిళా మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగింది.

మద్యం మత్తులో ఉన్న లీసా అనే మహిళను పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అలా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన మహిళకు కాస్త మత్తు దిగిన తరువాత రెచ్చిపోయింది. పట్టుకోవడానికి ప్రయత్నించిన మహిళా పోలీసుల వేలు కొరికింది. మెడపై రక్కింది. పాపం పోలీసులు అవేమి పట్టించుకోకుండా.. ఆ మహిళను జాగ్రత్తగా కూర్చోపెట్టారు. ప్రాధమిక వివరాల ప్రకారం ఆమెది నాగాలాండ్ అని, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలిసింది. పూర్తిగా మద్యం మత్తు దిగిన తరువాత వివరాలు కనుక్కొని ఆమెను కుటుంబసభ్యులకు అప్పగిస్తారట. మద్యం మత్తులో ఆ మహిళ సృష్టించిన వీరంగం తలుచుకొని పోలీసులు భయపడిపోయారు.





Untitled Document
Advertisements