‘నిత్యకళ్యాణం’ ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 03:37 PM

తెలుగు దేశం అధినేత చంద్రబాబు,లోకేష్ ,పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి మరో సారి విమర్శలు చేసారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రతి పక్షాల పై కామెంట్స్ చేసారు. " వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? మాలోకం ఏదో అన్నాడు కాని ఎవరూ పట్టించుకోలేదు. మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది."

"'బంగారు బాతు' అమరావతిని చంపేశారని చంద్రబాబు గారు శోకాలు పెడుతున్నదెందుకో ఇప్పుడర్థమైంది. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్లు ముట్ట చెప్పిందని ఇన్‌కంటాక్స్ వాళ్లు బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయి.మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ "భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో వచ్చిందని చెప్పి అజ్ణానాన్ని బయట పెట్టుకున్న ‘నిత్యకళ్యాణం’ ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో. హిందీ, ఇంగ్లీష్ రాకుంటే అక్కడ హోటల్ లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేం".అని ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి రాసుకొచ్చారు.





Untitled Document
Advertisements