ఇసుక కొరత పై చంద్రబాబు నిరసన దీక్ష చేయడం తో తెరపైకి కొత్త కొత్త విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజకీయ విమర్శలు చేసిన వారు సైతం వ్యక్తిగత దూషణలు చేయడానికి వెనకాడడం లేదు. పవన్ కళ్యాణ్ పై వచ్చిన వ్యక్తిగత విమర్శలను చంద్రబాబు ఖండించినారు. అయితే చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు చేస్తున్న విమర్శల పట్ల వైసీపీ నేతలు సహనం కోల్పోయి టీడీపీ నేతల పై దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే వైసీపీ చేస్తున్న విమర్శలకు గానూ. దేవినేని ఉమా వైసీపీ నేతల పై విరుచుకు పడ్డారు. జగన్ చిటికేస్తే టీడీపీని వైసీపీ స్టోర్ రూమ్ లో పెడతామని చేసిన వ్యాఖ్యలకు, సిబిఐ చిటికేస్తే అయన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి, వైసీపీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి అని రివర్స్ కౌంటర్ వేశారు. మొదట మీ ఇల్లు చక్కదిద్దుకోండి అంటూ విమర్శలు చేశారు. అయితే టీడీపీ కి అధికారం, ప్రతి పక్షం కొత్త కాదని దేవినేని ఉమా అన్నారు. పార్టీకోసం ప్రాణం ఇచ్చే వరున్నరై, అలాంటి పార్టీని స్టోర్ రూమ్ లో పెడతారా? అంటూ వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు.