తాగుడికి కక్కుర్తి పడి ... కేవలం 10 రూపాయలకు మర్డర్లు చేస్తున్నఘటన

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 05:24 PM

కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట వద్ద కేవలం పది రూపాయల కోసం హత్య చేయడానికి కూడా వెనకాడని తాగుబోతులు. తాగిన మైకంలో ఏమి చేస్తున్నారో అర్థం కాక ప్రాణాలను సైతం తీసుకునే స్థాయికి దిగజారిన సంఘటన సున్నిపెంట లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే సున్నిపెంట గ్రామానికి చెందిన షేక్ మౌలాలి శ్రీశైలం కి చెందిన శివ ఇద్దరూ ప్రైవేటు వాహనాలకు డ్రైవర్లు గా పని చేస్తున్నారు .అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణంలో లో మద్యం సేవించారు.దుకాణం నుంచి బయటకు వచ్చి షేక్ మౌలాలి ని పది రూపాయలు ఇవ్వవలసిందిగా శివ కోరగా మౌలాలి నీకు ఎందుకు ఇవ్వాలి అని ఇద్దరి మధ్య వాగ్వివాదం తారస్థాయికి చేరడంతో తాగిన మైకంలో పరుషమైన అసభ్యకరమైన మాటలతో దూషించడం తో రెచ్చిపోయిన శివ అక్కడే ఉన్న మద్యం బాటిల్ ను పగులగొట్టి షేక్ మౌలాలి పై దాడి గొంతుపైతీవ్ర గాయమై రక్తస్రావం ఎక్కువ కావడంతో స్థానికులు 108 వారికి సమాచారం ఇచ్చారు. గాయపడిన షేక్ మౌలాలి ని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. సమాచారం తెలుసుకున్న శ్రీశైలం టూటౌన్ పోలీసులు శివను అదుపులోనికి తీసుకుని విచారించగా కేవలం 10 రూపాయల కోసమే జరిగినట్లుగా షేక్ మౌలాలి వాంగ్మూలం ఇవ్వడంతో కేసు నమోదు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్ఐ పీరయ్య యాదవ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన షేక్ మౌలాలి ని మెరుగైన వైద్యం కోసం శ్రీశైలం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు కర్నూలుకు తరలిస్తున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements