మీరు అన్నం బదులు వేరేది తింటున్నా అని ప్రకటిస్తే మేము సమాధానం చెప్తాము

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 06:52 PM

ఏపీ లో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. అధికార ప్రతిపక్ష నాయకులూ ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల ఫై బుద్ద వెంకన్న స్పందించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి కి సవాల్ విసిరారు. " 151మంది ఎమ్మెల్యేలు గెలిచిన తరువాత కూడా అభద్రతాభావంతో మా పార్టీ ఎమ్మెల్యేలను వైకాపాలో చేర్చుకుంటున్నాడు మీ తింగరి మాలోకం. ఎందుకు అంత భయం? చెత్త నిర్ణయాల కారణంగా మీరు, మీ తింగరి మాలోకం మాత్రమే పార్టీలో మిగులుతారు అనే భయమా విజయసాయి గారు ? అని ప్రశ్నించారు.

"మీ పార్టీలో చేరిన నాయకుడి సవాల్ కి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు?సమాధానం మేము చెప్పడానికి సిద్ధం కానీ ఒక చిన్న కండిషన్. అదే నాయకుడు అన్నం తినేవాడు వైకాపాలో చేరడు అని అన్నారు. మరి మీరు అన్నం బదులు వేరేది తింటున్నా అని ప్రకటిస్తే మేము సమాధానం చెప్పడానికి సిద్ధం. అన్నయ్యలు వెతకండి అని ప్రాధేయపడ్డాడు, కాళ్ల మీద పడ్డారు జగన్ గారు. సార్ ఆయన మీలా మేతగాడు కాదు వెతకడానికి అవుతున్న ఖర్చు వృధా తప్ప దొరికింది ఏమి లేదు అని అధికారులు కుండబద్దలు కొట్టడంతో అలవాటైన పాత పని గోబెల్స్ ప్రచారం మళ్లీ ప్రారంభించారా విజయ సాయి రెడ్డి గారు.? ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ లో దొరికింది మీ తింగరి మాలోకం అనేది మీ పత్రిక సాక్షికి మాత్రమే తెలియని నిజం. డబ్బు ఎన్నికల్లో వాడేసారు ఇప్పుడు ఆ కంపెనీలకే రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు కట్టబెడుతున్నారు.కొత్త కేసుల్లో ఇరుక్కుంటే ప్రజలు మొహాన ఉమ్ము వేస్తారు అనే భయంతో ఢిల్లీ వెళ్లారు. ఐటీ రైడ్స్ లో జగన్ గారు పేరు బయటకు రాకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారు.అని బుద్ధ వెంకన్న తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మరి దీని పై వైసీపీ నాయకులూ ఎలా స్పందిస్తారో చూడాలి.





Untitled Document
Advertisements