వైఎస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్టును కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించడంతో.. తెలంగాణకు చెందిన 90, ఆంధ్రప్రదేశ్కు చెందిన 168 ఎన్జీవోలపై మోదీ సర్కారు నిషేధం విధించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ 2010 (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్టరై.. హైదరాబాద్, సికింద్రాబాద్లో నడుస్తోన్న చర్చిలు, విద్యా సంస్థలను క్యాన్సిల్ చేసింది. ఈ జాబితాలో సేవా భారతి, హైదరాబాద్ ఆర్క్డియోసీజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ ఉన్నాయి. ఏపీలో రురల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ, రాయపాటి ఛారిటబుల్ అసోసియేషన, వైఎస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్ట్, ఫిలడేల్ఫియా జియాన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి తదితర ఎన్జీవోల రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేసింది. విదేశీ నిధులకు సంబంధించి వార్షికాదాయం, ఖర్చుల వివరాలను అందజేయకపోవడమే.. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి ప్రధాన కారణం. ఎఫ్సీఆర్ఏ కింద విదేశీ నిధుల సమాచారాన్ని ఎన్జీవోలు వార్షిక రిటర్నులలో సమర్పించడాన్ని కేంద్ర హోం శాఖ తప్పనిసరి చేసింది.