అక్కినేని నాగేశ్వర్ రావు(ఏఎన్ఆర్) జాతీయ పురాస్కారాల ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగాయి. ఈ క్యాక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. 2018 ఏడాదికి గానూ దివంగత నటి శ్రీదేవికి, 2019 ఏడాదికి గానూ ప్రముఖ బాలీవుడ్ నటి రేఖకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, రేఖలకు చిరంజీవి పురాస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు రేఖ, బోనీకపూర్ లతోపాటు మెగాస్టార్ చిరంజీవి, కళాబంధు సుబ్బిరామిరెడ్డి, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, నాగసుశీల, సుమంత్, సుశాంత్, విజయ్ దేవరకొండ, లావణ్య త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.